
చేపల సంక్షేమం ఎందుకు అవసరం?

దేశంలో చాలా చేపలు పెరుగుతున్నాయి.
ప్రతి సంవత్సరం 3 నుండి 14 బిలియన్ చేపలను పెంచుతున్నారు. ఇది భారతదేశంలోని అన్ని ఇతర సకశేరుక జంతువుల సంఖ్య కన్నా దాదాపు పది రెట్లు ఎక్కువ!

చెరువుల్లో చేపలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి.
వీటి జీవనానికి పరిస్థితులు చాలా కష్టతరంగా మారాయి: చా లా చేపలు అధిక సంఖ్యలో, తక్కువ నీటి నాణ్యత మరియు అధిక వ్యాధి రేట్లు ఉన్న చెరువులలో నివసిస్తున్నాయి.

వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
భారతీయులుగా, సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం మరియు అన్ని జంతువులను జాగ్రత్తగా చూసుకోవడం మన ప్రాథమిక బాధ్యత. చేపలు మనకంటే వేరుగా ఉన్నప్పటికీ, అవి కూడా బాధను మరియు భావోద్వేగాలను అనుభవించే సున్నితమైన జంతువులు మరియు వాటిని గౌరవించడం మన బాధ్యత.

చేపల సంక్షేమం రైతులకు, మరియు పర్యావరణానికి చాలా మేలు చేస్తుంది.
ఇది కేవలం జంతువుల గురించి మాత్రమే కాదు - పెంచుతున్న చేపలకు మెరుగైన చికిత్సను అందించడం ద్వారా, మనం చెరువులలో వ్యాధి మరియు మరణాల రేటును తగ్గిస్తాము మరియు చుట్టుపక్కల పర్యావరణంపై రసాయనా భారాన్ని తగ్గిస్తాము, ఈ విధంగా మనం మంచి స్థిరమైన వ్యాపారాన్ని మరియు ఆరోగ్యకరమైన సమాజాన్ని ప్రోత్సహిస్తాము.




